Sunday, September 15, 2024

AP | గుడివాడలో ఉద్రిక్త‌త‌… పేర్ని నానిపై దాడి

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. తాజాగా గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పవన్ పై నానీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో నాని కారుపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. అలాగే తోట శివాజీ ఇంటి బయట ఉన్న మరో వైసీపీ నేత పాలేటి చంటి కూడా కారు అద్దాలు పగలగొట్టడంతో… దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పేర్ని నాని, ఇంటూరి రవికిరణ్ తదితర నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిపై స్పందించిన వైసీపీ.. ఇలాంటి దాడులేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement