Thursday, July 4, 2024

AP – చంద్ర‌బాబుతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ భేటి… ప‌లు అంశాల‌పై చ‌ర్చ ..

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ లో నేడు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించ‌నున్నారు.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న హైద‌రాబాద్ నుంచి విమానంలో గ‌న్న‌వ‌రానికి చేరుకున్నారు.. అక్క‌డ ఆయ‌న‌కు ఎపి ఉన్న‌తాధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. ఆ త‌ర్వాత ఆయ‌న సిఎం చంద్ర‌బాబుని క‌లిసేందుకు మండ‌వ‌ల్లిలోని చేరుకున్నారు..

అనంత‌రం చంద్రబాబు, గవర్నర్‌ రాధాకృష్ణన్ లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం..

అంత‌కు ముందు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారికి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్‌ని సత్కరించారు.. తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement