Friday, September 6, 2024

AP – ఆస్తిలో వాటా కోసం తండ్రిని హ‌త్య చేసిన త‌న‌యుడు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్డ్ … మదనపల్లె : ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి తనయుడు హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. వివ‌రాల‌లోకి వెళితే పట్టణంలోని పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పెద్దకుమారుడు రఘునాథరెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తూ రూ.16 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పుల వేధింపులు ఎక్కువవ్వడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు. గత కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భోజనం చేశాక సమీపంలోని వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తున్న చిన్నరెడ్డప్పరెడ్డిని రఘునాథరెడ్డి నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రఘునాథరెడ్డి తన కారుతో తండ్రిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. శంకర్‌రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతోపాటు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో బంధువులు, పోలీసులు రాత్రంతా చిన్నరెడ్డప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

గురువారం తెల్లవారుజామున పట్టణంలోని వీవర్స్‌ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ యువరాజు వివరాలు సేకరించి మృతదేహాన్ని మదనపల్లె సర్వజన బోధనాసుపత్రికి తరలించారు. మృతుడి చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘునాథరెడ్డిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement