Friday, September 13, 2024

AP – విజ‌య‌వాడ‌లో కేంద్ర‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప‌ర్య‌ట‌న‌

మంత్రి లోకేష్​తో క‌ల‌సి ఏరియ‌ల్ స‌ర్వే
బోటులో జ‌క్కంపూడి కాల‌నీకి ప‌య‌నం
మిల్క్ ఫ్యాక్ట‌రీ ప్రాంతంలోని బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌
వ‌ర‌ద న‌ష్టాల‌పై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేసిన చౌహాన్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజ‌య‌వాడ:
బుడ‌మేరు వరద ముంపు ప్రాంతాల్లో గురువారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప‌ర్య‌టించారు.. ముందుగా ఆయ‌న ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను హెలికాప్ట‌ర్ ద్వారా వీక్షించించారు.. ఆయ‌నతో పాటు మంత్రి నారాలోకేష్ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ఆ త‌ర్వాత రోడ్డు మార్గంలో బ‌య‌లు దేరి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు.. జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బోట్ ల‌లో వెళ్లి అక్క‌డ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో స‌మీక్ష‌..

తాజాగా విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.. ఇక మ‌రికాసేప‌ట్లో వరద నష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కేంద్రమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించనున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించి, నివేదికలు అందజేయనున్నారు వివిధ శాఖల ఉన్నతాధికారులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement