Friday, October 18, 2024

AP – సూపర్ సిక్స్ ఏమ‌య్యాయి? – చంద్రబాబును నిలదీసిన షర్మిల

( ఆంధ్రప్రభ స్మార్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో) ఏపీ మంత్రి మండలి భేటీలో సూపర్ సిక్స్ లో కనీసం ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారు అనుకున్నాం, – మహిళలకు శుభవార్త చెప్తారు అని అనుకున్నాం, – ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం రెండు లో బడ్జెట్ స్కీమ్ లే .. కానీ – బాబు సూపర్ సిక్స్ లు గాలికి కొట్టుకు పోయాయని పీసీసీ చీఫ్ షర్మిలా తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆంధ్రతర్న భవన్ లో గురువారం విలేఖరుల సమావేశంలో ఏపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, పాత సిక్స్ పోయి – కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయన్నారు. – కొత్త పరిశ్రమలు రాష్ర్టానికి వస్తే మంచిదేనని, – పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తామన్నారని, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపారని, కానీ , కానీ ఇవ్వన్నీ అమలుచేసే చిత్త శుద్ధి బాబుకు ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. అన్నారు . – 2014 లో పెద్ద పెద్ద పథకాలు అన్నారు, – అమరావతిని సింగపూర్ చేస్తామన్నారు, త్రీడీ గ్రాఫిక్స్ చూపించారని, – అప్పుడు చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పిన వాటికి ఏమాత్రం తేడా లేదని, పాత సినిమా కి కొత్త టైటిల్ పెట్టారని షర్మిల విమర్శించారు. – బాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లుగా ఉందని, పాత గిఫ్ట్ కొత్త బాక్స్ లో ఇస్తున్నారని, ఇవి అమలు అవుతాయా లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయన్నారు.

జాబ్ ఫస్ట్ సరే… లెక్కలు సరీగా చూడండి

- Advertisement -

ఒక విషయంలో బాబును స్వాగతిస్తున్నామని, జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే, – రాష్ట్రంలో నిరుద్యోగం తారా స్థాయిలో ఉంది, – ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు, – గత 10 ఏళ్లుగా పరిశ్రమలు లేక యువకులు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే…5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి ? – ఉద్యోగాలు అని గతంలో మోడీ ప్రభుత్వం కూడా మోసం చేసిందన్నారు.

20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయని షర్మిల ప్రశ్నించారు. – ఒక్క ఉద్యోగం ఇవ్వని మోడీ కి ఎందుకు బాబు మద్దతు ఇస్తున్నారు ? – రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలని, – బాబు కేంద్రాన్ని బాబు డిమాండ్ చేయాలన్నారు. – మోడీ, బాబు ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగాల కల్పన పై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని షర్మిల డిమాండు చేశారు . రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, – ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు, – మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి తేల్చాలని, – జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేయాలని షర్మిల డిమాండు చేశారు.

లోకేష్ బాబూ… మోడీని నిలదీయండి
మోడీకి ఇచ్చిన మాట లోకేష్ నిలబెట్టుకున్నారట, – 21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి మరీ ఇచ్చారట, అయ్య లోకేష్… మీరు ఇచ్చిన మాట సరే…మోడీ ఇచ్చిన మాట ఏంటి ? – రాష్ట్రంలోని 25 ఎంపీలు అందరు మోడీకి ఊడిగం చేస్తూనే ఉన్నారు. – ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి లో నిలబడి మోడీ చెప్పారుఆయన ఇచ్చిన మాట ఎక్కడ పోయింది, అని షర్మిల ప్రశ్నించారు. – హోదా వచ్చి ఉంటే… పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు పోటీ పడి మరీ పరిశ్రమలు వస్తాయన్నారు. – ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్ లో 2 వేల పరిశ్రమలు వచ్చాయి, – హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చాయి, – మరి హోదా మీద మోడీ ఇచ్చిన మాట ఎక్కడ పోయిందన్నారు. ఇక – పోలవరం నాది భాధ్యత అని మోడీ అన్నారు, అమరావతి రాజధానిని న్యూ ఢిల్లీ మించిన రాజధాని అన్నారు, – మట్టి కొట్టి పోయారు, తప్పితే ఒక్క రూపాయి ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. – వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు అన్నారు, ఇవ్వలేదని, విశాఖ స్టీల్ కి ఒక్క క్యాపిటల్ మైన్ ఇస్తే మోడీకి జరిగే నష్టం ఏముంది ? – మోడీని నిలబెట్టి లోకేష్ అడగాలి అని షర్మిల డిమాండ్ చేశారు. –

నిరుద్యోగ భృతి జాడేది

సూపర్ సిక్స్ పాలసీలు సరే…సూపర్ సిక్స్ పతకాలు ఎక్కడ పోయాయి నిరుద్యోగ భృతి ఉన్నట్లా ? లేనట్లా ? – 2014 లోనే మీరు 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు, – ఇప్పుడు 3 వేలు అంటున్నారు. ఇంత వరకు భృతి పై జాడ లేదు, – తల్లికి వందనం నిధుల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. – మహాలక్ష్మి పథకం కింద 15 వందలు ఇస్తాం అన్నారు… ఏమయ్యింది ? – ఉచిత సిలిండర్ల కు దసరా అన్నాడు…దీపావళి అన్నారు… రేపు సంక్రాంతి అంటారేమో.. అని షర్మిల ఎద్దెవ చేశారు.

ఏడాదికి 2 వేల నుంచి 4 వేల కోట్లకు ఖర్చు అయ్యే పథకానికి నిధులు లేవా ? – ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యింది ? అని ప్రశ్నించారు. – హర్యానా ఎన్నికలతో ఏపీ నీ జగన్ ఎలా పోలుస్తారు ?, జగన్ కు తెలియదు ఏమో…- ఇక్కడ ప్రజల నాడికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి, – హర్యానా లో ప్రజల నాడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది . – ఏపిలో ఫలితాలు అనుకున్నట్లే వచ్చాయి, – జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకున్నారు అని షర్మిల అన్నారు. ఇక – లిక్కర్ విషయంలో జగన్ కి, బాబు కి పెద్ద తేడా లేదన్నారు. – జగన్ హయంలో లిక్కర్ మాఫీయాకు తాడేపల్లి ప్యాలెస్ కి లింక్ ఉందని, – బాబు హయంలో నియోజక వర్గంలోని తమ్ముళ్ళ చేతుల్లో మాఫీయా చేరిందని, లిక్కర్ విషయంలో – ఇద్దరు దొందు దొందే అని షర్మిల ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement