Tuesday, September 17, 2024

AP – షామిరాజ్ విద్యార్థుల ఉదారత … కూరగాయలమ్మి…


కూరగాయలమ్మి సీఎం సహాయ నిధికి విరాళం
కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి అందజేతస

( ఆంధ్రప్రభ స్మార్ట్, మచిలీపట్నం ప్రతినిధి ) – కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన షామిరాక్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసికట్టుగా వరద బాధితులకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు చెక్కును జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి అందజేశారు. వరద ప్రాంత బాదితులను ఆదుకోవాలనే లక్ష్యంతో తమ పాఠశాల విద్యార్థులు చేనేత వస్త్రాలు, కూరగాయలు విక్రయించి, తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్ష రూపాయలు సేకరించారని , ఈ మొత్తానికి పాఠశాల యాజమాన్యం మరో రెండు లక్షల రూపాయలు జోడించి మొత్తం రూ. మూడు లక్షల చెక్కును పాఠశాల కరస్పాండెంట్ సుమన్ త్యాగరాజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ వో శ్రీదేవీ, పాఠశాల అధ్యక్షురాలు మౌనిక సుమన్, ప్రిన్సిపాల్ భారతి, వైస్ ప్రిన్సిపాల్ తుషార, విద్యార్థులు ధర్ష, అండ్రియా, గుర్మన్, అర్జున్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement