Friday, September 20, 2024

AP: డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఏపీ స‌ర్కార్ శుభ‌వార్త‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం డీఎస్సీ రాసే గిరిజన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజ‌న అభ్య‌ర్థుల‌కు ఉచితంగా డీఎస్సీ శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో కోచింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉంది.

ఒక్కో సెంట‌ర్‌లో 150 మంది చొప్పున, మూడు నెల‌ల పాటు శిక్ష‌ణ ఉంటుంది. దీని కోసం ఒక్కో అభ్య‌ర్థికి ప్ర‌భుత్వం పాతిక‌వేల రూపాయ‌లు వెచ్చించ‌నుంది. ఇక 16,347 పోస్టుల‌తో ఏపీ స‌ర్కార్ భారీ డీఎస్సీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో వ‌ర్షాల బీభ‌త్సం కార‌ణంగా ఈ ఉచిత శిక్ష‌ణ తాలూకు తేదీల‌ను ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారిక వ‌ర్గాల స‌మాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement