Thursday, September 12, 2024

AP నంద్యాలలో రౌడీషీటర్ దారుణ హత్య …

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ కర్నూల్ బ్యూరో – నంద్యాల పట్టణంలోని కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి మసీద్ పురం మిట్ట వద్ద శుక్రవారం రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యారు. సాయి అలియాస్ కవ్వను గుర్తుతెలియని వ్యక్తుల గ్యాంగ్ కత్తులతో నరికి హ‌త్య చేశారు.

కాగా హ‌తుడు 2022లో నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ హత్య కేసులో ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు. అప్పట్లో ఓ బ్యాగుల దుకాణం వద్ద తమను ప్రశ్నించాడ‌ని ఎస్ బి కానిస్టేబులును హతుడు తో పాటు మరో ముగ్గురు పట్టపగలు వెంటాడి హతమార్చారు. అప్పట్లో ఈ ఘటన నంద్యాల జిల్లాలో నే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది. ప్రస్తుతం ఆ కేసులో నిందితులుగా ఉన్న అల్లూరి వెంకట సాయి అలియాస్ కవ్వ ను మరో రౌడీషీట్ గ్యాంగ్ నేడు హ‌త్య చేసిన‌ట్లు సమాచారం. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు.. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement