Friday, September 6, 2024

AP – నన్ను చంపాలని ప్లాన్ చేశారు… తీవ్రంగా హింసించారు

డాక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారు
ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు
మాజీ సీఎం జగన్‌పై, పోలీసు అధికారులపై కేసు నమోదు

ఆంధ్రప్రభ స్మార్ట్, గుంటూరు ప్రతినిధి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు కస్టడీలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజునుహింసించారనే ఆరోపణల నేపథ్యంలోఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామరాజు తన పిటిషన్ లో ఆరోపించారు.

అయిదుగురిపై కేసు నమోదు

- Advertisement -

ఈ కేసులో ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు,ఏ 3 గా జగన్ ను, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 2021 మే 14 జరిగిన ఘటనపై రఘురామరాజు బుధవారం ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని… తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement