Friday, October 18, 2024

AP – ఆ పైప్ లైన్ నిర్మాణ మార్గాన్ని మారుస్తాం : ఎంఎల్ఏ సోమిరెడ్డి

ముత్తుకూరు – ఆంధ్రప్రభ – శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం లోని కృష్ణపట్నం గ్రామ పంచాయతీ సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పైపు లైన్ నిర్మాణాన్ని మరోచోటకు మారుస్తామని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మత్స్యకార గ్రామమైన అర్కాటి పాలెం కు నేడు విచ్చేశారు.

ఈ సందర్భంగా మత్స్యకారులకు ఆయన హామీ ఇచ్చారు. పైపులైను గ్రామం మీదుగా వెళుతుందని ఎన్నికల సమయంలో గ్రామస్తులు సోమిరెడ్డికి చెప్పగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఈ విషయంపై స్పందించారు. సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో పెట్రోలియం పైపులైను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, స్థానిక సీనియర్ నాయకులు యేకొల్లు కోదండ రామయ్య, ఈదురు రామ్మోహన్ రెడ్డి, తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు రాగాల శివకృష్ణ, నాయకులు పల్లం రెడ్డి శ్రీధర్ రెడ్డి, తిన్నెల పూడి సిద్దు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement