Monday, October 21, 2024

AP – నేడు గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్

విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు.. ఈ సందర్భంగా గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించనున్నారు పవన్‌ కళ్యాణ్. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ ఎస్ ఆర్ పేట మంచినీటి పధకం పరిశీలన చేస్తారు.

అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన ఉంటుంది. 11.30 గంటలకు గుర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పరిస్థితి తనిఖీ చేస్తారు .. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు .

మధ్యాహ్నం 12 గంటలకు గుర్లలో బయలుదేరి కలెక్టర్ కార్యాలయంకు చేరుకోనున్నారు పవన్ . అనంతరం కలక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement