Saturday, September 21, 2024

AP – థాంక్స్ మోడీజీ – మీ వల్ల 53 లక్షల కుటుంబాలకు లబ్ధి – పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – తాజా ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి సర్కార్ కు కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. తన రాజకీయ అవసరం కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం కానీ ఏదో విధంగా చంద్రబాబు సర్కార్ కు శుభవార్తలు అందిస్తోంది.

.

సీఎం చంద్రబాబు అడిగిందే తడవుగా రాష్ట్రానికి సాయం చేయడంలో ముందు ఉంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరో అంశంలో కీలక ప్రకటన చేసింది.రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న పనిదినాల్ని పెంచాలని, వీటి పరిధి కూడా విస్తరించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం కోరుతోంది. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు కేంద్రానికి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

.

- Advertisement -

దీంతో కేంద్రం ఏపీలో ఈ ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన పని దినాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు విజ్ఞప్తికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.2024-24 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పని దినాలు పెంచేందుకు కేంద్రం అంగీకరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం.. రాష్ట్రంలో ఉపాధి హామీ పనిదినాల్ని 15 కోట్ల నుంచి 21.5 కోట్లకు పంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పని దినాలు పెంపునకు అంగీకరించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పెంపు మూలంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement