Friday, October 18, 2024

AP – ఇంకా తానే సిఎం అనే భ్ర‌మ‌లోనే జ‌గ‌న్ – పవన్ కల్యాణ్

జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎద్దేవా
ఇంకా ఆయ‌న‌కు త‌త్వం బోధ‌ప‌డ‌లేదు
వినుకొండ హ‌త్య‌కు రాజ‌కీయ రంగు
కుట్ర‌ల‌కు తెర‌లేపితే ఇక అంతే సంగ‌తులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – మాజీ ముఖ్య‌మంత్రి జగన్ కు ఇంకా తత్వం బోధపడలేదని అన్నారు జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ . కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమ‌రావ‌తిలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వినుకొండలో చోటుచేసుకున్న గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. అవాస్తవాలను చెపుతూ కుట్రలకు తెర లేపుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికీ తానే సీఎం అని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం సీఎంగానే ఉంటాననే భ్రమల్లోంచి జగన్ ను ప్రజలు బయటపడేశారని చెప్పారు. చంద్రబాబుకు తాను, తమ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర పురోగతికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా మద్దతిస్తామని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement