Friday, October 18, 2024

AP – 14 నుంచి పల్లె పండుగ – కంకిపాడు లో ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

ఆమరావతి: ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభించనున్నారు..

కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్లతో 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.

మొత్తం 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం లాంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement