Friday, September 20, 2024

AP మన్యం లో ఏనుగుల దాడి….

ఎపి లోని మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు. తన దారిలో వెళ్లిపోతుండగా.. ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement