Saturday, September 21, 2024

AP: సాగునీటి ప్రాజెక్టుల‌కు ఇక పాత పేర్లే..

జ‌గ‌న్ పెట్టిన పేర్ల‌కు బై బై
కొత్త‌ పేర్ల‌తో జీవో విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమరావతి: ఏపీలోని వివిధ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అసలు పేర్లను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో జగన్‌ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ సహా వైకాపా నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. ఈ నేపథ్యంలో వాటి పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్‌ఆర్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు పేరును మార్చారు. దీన్ని గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారిస్తూ ఉత్తర్వులిచ్చారు. వైఎస్‌ఆర్‌ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలిచ్చారు. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement