Tuesday, September 17, 2024

AP – ప‌రువు న‌ష్టం కేసులో లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌….

విశాఖ – “చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్ష‌లండి“ పేరుతో అస‌త్య క‌థ‌నంపై నారా లోకేష్ వేసిన ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జ‌ర‌గ‌నున్న క్రాస్ ఎగ్జామినేష‌న్‌కి ఆయన హాజ‌రు కానున్నారు.

. అవాస్త‌వాల‌తో ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ స్టోరీ వేశార‌ని లోకేష్ త‌న న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని ఆ పత్రికకు పంపించారు. ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో పరువునష్టం దావా వేశారు.

తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తాను విశాఖ‌లో ఉన్నాన‌ని ప్రచురించిన తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని ఖండించారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్ర‌తిష్ట‌ని మంట‌గ‌లిపేందుకు ప్ర‌య‌త్నించార‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

- Advertisement -

మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్ప‌ష్టం చేశారు. వివిధ కార‌ణాల‌తో చాలా రోజులుగా వాయిదాలు ప‌డిన ఈ కేసు లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లు అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement