Friday, October 25, 2024

APలో ఉచిత సిలిండర్లు పథకం – 48 గంటల్లో ఖాతాలలో అమౌంట్​

గ్యాస్ పంపిణీ వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి నాదెండ్ల
ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్
సిలిండ‌ర్ అందిన క్ష‌ణం నుంచి 48 గంట‌ల్లోపు ఖాతాల్లో న‌గ‌దు జ‌మ

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజయవాడ: ఏపీలో దీపావ‌ళి నుంచి ప్రారంభం కానున్న‌ ఉచిత గ్యాస్‌ పంపిణీపై పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క అప్డేట్ ఇచ్చారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 29వ తేదీ నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ఉంటాయ‌న్నారు. ఆ రోజు ఉద‌యం 10గంట‌ల నుంచి వినియోగ‌దారులు బుక్ చేసుకోవచ్చ‌ని తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆయిల్ కంపెనీల‌కు ₹894 కోట్లు అందిస్తామని, ఈ నెల 29వ తేదీన సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా ఆయిల్ కంపెనీల‌కు చెక్కు అంద‌జేస్తాం అన్నారు. సిలిండ‌ర్ బుక్ చేసుకోగానే ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌మాచారం వెళ్తుందని తెలిపారు. కాగా, బుకింగ్ అయిన‌ 24 నుంచి 48 గంటల్లో సిలిండ‌ర్‌ను అందిస్తామ‌ని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అదే పట్టణాల్లో అయితే కేవ‌లం 24 గంట‌ల్లోనే డెలివ‌రీ చేస్తామ‌న్నాయి. సిలిండ‌ర్ అందిన క్ష‌ణం నుంచి 48 గంట‌ల్లోపు వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కావ‌డం జ‌రుగుతుంది. అని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement