Sunday, October 6, 2024

AP – శ‌భాష్ అమాత్య‌….

తెనాలిలో రోడ్డు ప్ర‌మాదం
ఒక‌రి మృతి.. న‌లుగురికి గాయాలు
అదే దారిలో వెళుతున్న మంత్రి స‌విత
స్పందించి బాధితుల‌కు సాయం
క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్ కు త‌ర‌లింపు
మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని అదేశం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – తెనాలి – గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్‌ వద్ద నేడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్‌ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement