Tuesday, September 17, 2024

AP | ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు..

ఏపీలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇప్పటికే పలు దఫాలుగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా 37 మంది అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

పల్నాడు ఎస్పీ – శ్రీనివాసరావు
గుంటూరు ఎస్పీ – సతీష్ కుమార్
కాకినాడ ఎస్పీ – విక్రాంత్ పాటిల్
సత్యసాయి జిల్లా ఎస్పీ – వి. రత్న
అన్నమయ్య జిల్లా ఎస్పీ – విద్యాసాగర్ నాయుడు

కృష్ణా జిల్లా ఎస్పీ – గంగాధర్ రావు
ఏలూరు ఎస్పీ – ప్రతాప్ శివకిషోర్
పార్వతీపురం మన్యం ఎస్పీ – ఎస్వీ మాధవరెడ్డి
నెల్లూరు ఎస్పీ – కృష్ణకాంత్
కడప ఎస్పీ – హర్షవర్ధన్ రాజు
శ్రీకాకుళం ఎస్పీ – కేవీ మహేశ్వర్ రెడ్డి
విజయనగరం జిల్లా ఎస్పీ- వకుల్ జిందాల్
అనకాపల్లి ఎస్పీ – దీపిక

బాపట్ల ఎస్పీ – తుషార్ డూడీ
అల్లూరి జిల్లా ఎస్పీ – అమిత్ బర్దార్
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ – నరసింహ కిషోర్
పశ్చిమగోదావరి ఎస్పీ – అద్నాన్ నయూం అస్మీ
అంబేద్కర్ కోనసీమ ఎస్పీ- కృష్ణారావు
ప్రకాశం ఎస్పీ – ఏఆర్ దామోదర్

కర్నూలు ఎస్పీ – బిందు మాధవ్
నంద్యాల ఎస్పీ – అధిరాజ్ సింగ్ రాణా
అనంతపురం ఎస్పీ – కేవీ మురళీకృష్ణ
తిరుపతి ఎస్పీ – సుబ్బారాయుడు
విశాఖ డీసీపీ -1 – అజిత వేజెండ్ల
ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్- మలికా గార్గ్

- Advertisement -

మరోవైపు ఐపీఎస్ అధికారులు సిద్ధార్థ్ కౌశల్, రఘువీరారెడ్డి, జిఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, సుమిత్ సునీల్, జగదీష్, శ్రీధర్, సత్తిబాబులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement