Saturday, October 19, 2024

AP – ఏలూరు కాల్ మనీ కేసు .. ప్రధాన నిందితుడి అరెస్ట్…

ఏలూరులో కాల్ మనీ దందాలు కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు నేడు అరెస్ట్‌ చేశారు .. ఈ కేసులో వేధింపులకు పాల్పడి ప్రధాన నిందితుడు మేడపాటి సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.. మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసి అధిక వడ్డీల వ్యాపారం చేస్తున్న మేడపాటి సుధాకర్ రెడ్డితో పాటు అల్లాడ లావణ్య, వీరమల్ల రాజేష్ లను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు..

అధిక వడ్డీల వ్యాపారం చేస్తున్న వారందరికీ జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌ ఈ సందర్భంగా వార్నింగ్‌ ఇచ్చారు.. అధిక వడ్డీలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఉద్యోగులు అధిక వడ్డీల వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధిక వడ్డీలపై బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చు అని పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement