Tuesday, September 17, 2024

AP – ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్

సాక్ష్యాలు ధ్వంసం చేశార‌ని అభియోగాలు
రికార్డ్ ల ట్యాంప‌రింగ్ లో ఆయ‌న హస్తం
ప్రైవేటు వ్య‌క్తుల‌కు నెట్ లో ఉద్యోగాలు
రూ.800 కోట్ల అవినీతిలో నిందితుడు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారనే అభియోగంపై ఎపి ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నేడు జివో విడుద‌ల చేసింది. . ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించిన మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది ప్ర‌భుత్వం. ఇక, ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆంధ్ర ప్రధేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ ఆలోచ‌న‌లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement