Friday, October 18, 2024

Ap: ప్రేమ జంట ఆత్మహత్య


గుంటూరు జిల్లా పెదకాకానిలో ఘటన
గుంటూరు ( పెదకాకాని), ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా పెదకాకాని మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మండల కేంద్రమైన పెదకాకాని గ్రామంలో గల దానబోయిన సాంబశివరావు చిన్న కుమారుడు దానబోయిన మహేష్ (22), కృష్ణాజిల్లా నందిగామ మండలం పరిధిలోని రుద్రవరం గ్రామానికి చెందిన నండూరు వెంకయ్య కుమార్తె నండూరు శైలజ హైదరాబాదు నగరంలో ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఇద్దరు పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం తెలిసిన యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి నిరాకరించారు. గత పది రోజుల క్రితం అమ్మాయి తల్లి నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అబ్బాయి తండ్రి దానబోయిన సాంబశివరావుని నందిగాం పోలీస్ స్టేషన్ వారు విచారించారు.

- Advertisement -

కథనం అనంతరం శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాల మీద ఈ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతిచెందిన ప్రేమజంటను చూడటానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను చూసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement