Wednesday, September 18, 2024

AP – చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీ ఇస్తాం…. మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్

చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.. ఈ రోజు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంత‌రం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాన‌ని తెలిపారు…


ఏంఎస్ఏంఈ, సెర్ఫ్, ఎన్నారై విభాగం ఈ మూడు విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి త‌న‌కు అప్ప‌గించార‌న్నారు.. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. నూతన పారిశ్రామిక వేత్తలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తాన‌ని చెప్పారు… స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.. గత ప్రభుత్వం లో చిన్న పరిశ్రమల కు ఎదురైనా సమస్యలు పరిష్కరిస్తామ‌ని, బకాయి ఉన్న రాయితీలు త్వ‌ర‌లో అందజేస్తామని పేర్కొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement