Thursday, July 4, 2024

AP | జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం కేంద్ర రోడ్డు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్టులందరినీ టోల్‌ చార్జీల నుంచి మినహాయించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు చేస్తే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పని చేసేందుకు దోహదపడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement