Monday, July 1, 2024

AP – జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

శాసనసభ వ్యవహారాలపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం
సభ నియమావళిని ఎమ్మెల్యేల‌కు చెప్పిన ప‌వ‌న్
రేప‌టి నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ప‌వ‌న్ కల్యాణ్
11 రోజుల పాటు పండ్లు, ద్ర‌వాహారంతో దీక్ష‌..

విజయవాడ: జనసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలపై వారికి అవగాహన కల్పించారు. సభ నియమావళికి తెలియజేశారు.

- Advertisement -

రేప‌టి నుంచి వారాహి అమ్మవారి దీక్ష

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో ఆయ‌న వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.. మ‌ళ్లీ మ‌రోసారి ఆయ‌న ఈ దీక్ష చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement