Friday, September 27, 2024

AP – నేడు తిరుమ‌ల‌కు జ‌గ‌న్. . రేపు శ్రీవారిని ద‌ర్శించుకోనున్న మాజీ సిఎం

అమ‌రావ‌తి – మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ( రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ .. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమల గెస్టు హౌస్ లో బస చేసి శనివారం ఉదయం 10.20 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. తదుపరి తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

తిరుప‌తిలో 30 సెక్ష‌న్ నిషేదాజ్ఞ‌లు

మరోపక్క, తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో సెక్షన్‌ 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నందున ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ఇప్పటికే జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు వైసిపి నేతలు, కార్యకర్తలకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు నిర్వహించవద్దని సూచించారు. ర్యాలీలు, సభలు, భేటీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

- Advertisement -

ప్ర‌శాంత వాతార‌ణంలో స్వామివారిని ద‌ర్శించుకుంటా…

ఈ నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులకు కీలక అదేశాలు ఇచ్చారు. తన తిరుమల పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement