Sunday, September 8, 2024

AP కూటమి పాలనలో శాంతి భద్రతలు ఫెయిల్ – చర్యలు తీసుకోండి – గవర్నర్ తో జగన్

ఆంధ్ర ప్రభ స్మార్ట్ .. అమరావతి – మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్‌తో జగన్ భేటీ అయ్యారు..

ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు తెలిపారు. కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. దాడులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు గవర్నర్‌ జస్టిస్ అబ్దు్ల్‌ నజీర్‌కు జగన్ చూపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement