Monday, October 7, 2024

AP | కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు..

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోదావరి నది ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రేపు కోనసీమ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రేపు నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అటు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్ లో విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

గోదావరి నదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద పోటెత్తుతోంది. భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో, దిగువకు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement