Friday, September 20, 2024

AP | జగన్‌ విదేశీ పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌..

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట దక్కింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా.. మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తన కుమార్తె పుట్టిన రోజు కోసం సెప్టెంబర్‌ 3 నుంచి 25 వరకు యూకె వెళ్లేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాక జగన్ కు కొత్త కాల పరిమితితో పాస్ పోర్టు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement