Tuesday, September 17, 2024

AP – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తిరుపతిలో ఘన స్వాగతం

ఆంధ్ర ప్రభ స్మార్ట్, రేణిగుంట ( తిరుపతి జిల్లా) – గత రెండు రోజులుగా రాష్ర్ట వ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం గ్రామసభల్లో పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకోగా, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో రాయచోటికి చేరుకున్నారు. అక్కడి గ్రామసభలో పాల్గొన్నారు.

రేణిగుంట విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎం ఎల్ ఎ పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ప్రోటోకాల్ ఎస్ డీసీ చంద్రశేఖర్, సీసీ ఎఫ్ చంద్ర శేఖర్ రావు, డీఎఫ్ ఓ సతీష్ రెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement