Saturday, September 7, 2024

Breaking: టిటిడి ఇఓగా అదనపు ఇఓ ధర్మారెడ్డికి బాధ్యతలు

టీటీడీ ఈఓగా అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇకపై సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యతలను నిర్వహించనున్నారు.

మరోవైపు అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను మరో రెండేళ్లు పొడి గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. ఈనెల 14 నాటికి ఆయన డిప్యుటేషన్‌ ముగియనుంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఏడు సంవత్సరాల డిప్యుటేషన్‌ పూర్తి చేసుకున్నట్లవుతుంది. కేంద్ర నిబంధనల ప్రకారం కేంద్ర సర్వీసుల నుంచి వెళ్లిన ఏ అధికారీ ఏడేళ్లకు మించి డిప్యుటేషన్‌పై ఉండటానికి వీల్లేదు. అయితే, ఆయన సర్వీసులు తమకు అవసరమని, ఇంకొంతకాలం కొన సాగించాలని సీఎం జగన్‌ కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement