Sunday, September 29, 2024

ఈనెల 20న మొహర్రం సెలవు: సీఎస్ ఆదిత్యానాధ్ దాస్

మొహర్రం పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ చేశారు. వాస్తవానికి ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 19వ తేదీ గురువారం మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినమైన్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ సెలవు దినాన్ని ఈనెల శుక్రవారానికి మార్పు చేసింది. దీంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొహర్రం సెలవు దినాన్ని గురువారానికి బదులుగా 20వతేదీ శుక్రవారానికి మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 20వతేదీ మొహర్రం పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, వివిధ స్థానిక సంస్థలకు ఈసెలవు దినం వర్తిస్తుంది. అదే విధంగా నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం వివిధ బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు మొదలైన వాటికి కూడా ఈసెలవు దినం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement