Sunday, October 6, 2024

AP | విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేరుగానే కాస్మెటిక్స్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటి వరకు విద్యార్థులకు అందిస్తోన్న కాస్మెటిక్స్ చార్జీలును ఆపేస్తూ.. నేరుగా వస్తువులనే ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. పేస్టు, బ్రష్, షాంపూ వంటి వస్తువులను నేరుగా విద్యార్థులకే ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదనను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు వద్దకు పంపారు. ఆయన ఓకే చెప్పిన తర్వాత వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement