Friday, September 6, 2024

APలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ఉత్తర్వులు జారీ చేసారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌లు బదిలీ

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం

విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం

విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు

- Advertisement -

అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ

అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ నియామకం

ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామకం

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ నియామకం

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి నియామకం

చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్ నియామకం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన నియామకం

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియామకం

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా

బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు

ప్రస్తుత గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం.. అల్లూరు జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఎం.విజయసునీత జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం కాకినాడ కలెక్టర్ జె.నివాస్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు .ప్రస్తుత ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం..ప్రస్తుత తూ.గో.జిల్లా కలెక్టర్ మాధవీలత జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం*ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement