Monday, October 21, 2024

AP – వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్

అమరావతి – : మాజీ మంత్రి, వైసిపి నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంతను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో(2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు.

ఈ కేసులో ఇప్పటికే వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement