Saturday, October 19, 2024

AP – వైపిపి మాజీ ఎంపి ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఈడీ సోదాలు

ఏక కాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన ఈడి
ఆడిటర్ వెంకటేశ్వరరావు, గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాల పై దాడులు
కొనసాగుతున్న తనిఖీలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంవివికి మొదలైన కష్టాలు
ఎండాడ భూముల పై బాధితుడు పిర్యాదు
ఆరిలోవ పీఎస్ లో కేసు నమోదు తో ఈడి అటాచ్!

విశాఖ క్రైం : ఆంధ్రప్రభ న్యూస్ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ,తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం దాడులు నిర్వహించింది. ఎంవివి సత్యనారాయణ, అతని ఆడిటర్ గణ్మణి వెంకటేశ్వరరావు, మరో నిందితుడు గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాలు సహా ఐదు చోట్ల ఆకస్మిక సోదాలు నిర్వహించినట్లు ఇడి వర్గాలు ధృవీకరించాయి.

ఎంవీవీ విశాఖ,హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఆధారంగా ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది! వృద్ధాశ్రమం,అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 12.5 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో సత్యనారాయణ తదితరులు లాక్కునేందుకు ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.

హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్, విశాఖపట్నంలోని ఆదర్శ్ నగర్ నివాసి జగదీశ్వరుడు, తాను, అతని భార్య రాధా రాణి 2006 నుండి హైగ్రీవల్‌ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను కలిగి ఉన్నారని ఈ పిర్యాదు లో పేర్కొన్నారు. 2008లో వారికి ఎండాడ గ్రామంలో ప్రభుత్వం 12.51 ఎకరాలు మంజూరు చేసిందని, ఈ భూమిని 2010లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు.
ఆడిటర్ వెంకటేశ్వరరావు తనకు ఎంవీవీ బిల్డర్స్‌కు చెందిన ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీని ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కోసం పరిచయం చేశారని పేర్కొన్నారు. 2020లో ఒక ఎం ఓ యూ సంతకం చేయబడిందన్నారు. అయితే నిందితులు ఫోర్జరీ సంతకాలు, విక్రయ పత్రాలను తయారు చేశారని ఆరోపించారు. తమను బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించారని, నిందితులు తమ విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని వెల్లడించారు.
నిలదీసి అడిగినందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. గీతాంజలి, అభినేత్రి, లక్ ఉన్నోడు, నీవెవరో వంటి చిత్రాలను నిర్మించిన ఎం వి వి సత్యనారాయణ తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు. రాజకీయాల్లో, అతను 2019 లో విశాఖపట్నం ఎంపీ సీటును గెలుచుకున్నాడు కానీ 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయాడు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గా పోటీ చేసి ఘోర పరాజయం పొందిన తర్వాత నుంచీ ఎంవీవీ కష్టాలు పీక్ కు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement