Sunday, October 6, 2024

AP – 22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల‌ ప్రదర్శన

ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి : కృష్ణా న‌ది తీరంలో ఈ నెల 22న భారీ స్థాయిలో డ్రోన్ షో నిర్వహించ‌నున్న‌ట్లు పెట్టుబడులు మౌలిక స‌దుపాయాల శాఖ కార్యద‌ర్శి సురేష్ కుమార్‌ వెల్లడించారు. ఆదివారం ఫైబ‌ర్‌ నెట్ కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్టాడారు. 22 , 23 తేదీల్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ -2024 జాతీయ స‌ద‌స్సును ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఇప్పటి వ‌ర‌కు దాదాపు 2500 డ్రోన్లతోనే ఇలాంటి ప్రద‌ర్శన చేశార‌ని, అయితే ఇప్పుడు అంత‌కు రెట్టింపు స్థాయిలో ఈ షోను రికార్డు స్థాయిలో నిర్వహించ‌బోతున్నట్లు తెలిపారు. ఈ షో తిల‌కించ‌డానికి ప్రజ‌లందరూ రావొచ్చ‌న్నారు. 22న మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్షన్ లో ఈ స‌ద‌స్సు జ‌రుగుతుంద‌న్నారు.

దీనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తార‌ని, కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న‌నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటార‌ని చెప్పారు. రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక‌స‌దుపాయ‌ల శాఖ మంత్రి బీసీ జ‌నార్థన‌రెడ్డి కూడా స‌ద‌స్సులో పాల్గొంటార‌న్నారు. సమావేశంలో డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement