ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని మాదాపూర్ నివాసం నుంచి ఉదయం 7 గంటలకు ఆయన రోడ్డు మార్గాన బయలుదేరారు. మెగా ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/pawan-1-3-1024x576.jpg)
అక్కడ అంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయిస్తారు పవన్ కల్యాణ్.. అనంతరం మధ్యాహ్నం 12.30కి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలు దేరుతారు.. ఈ పర్యటన సందర్బంగా కొండగట్టు వద్ద ఎపి పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వారాహి’ అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో భాగంగా కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.
పవన్ కళ్యాణ్కు గజ మాలతో స్వాగతం..
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/pawan-2-1-1024x576.jpg)
సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనంగా గజమాలతో ఆయన అభిమానులు స్వాగతం పలికారు.. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరారు.