Thursday, September 19, 2024

పడిపోయిన సీఎం జగన్ ర్యాంక్..

ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలిపింది ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను స్వరాష్ట్ర ప్రజలు బెస్ట్ సీఎం అంటూ కీర్తించారు. 42 శాతం మంది ఆయనకు ఓట్లేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. ఇక ఎపీలో బోల్డన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆయనకు సరైన ఆదరణ కరువైందని సర్వే పేర్కొంది. గతేడాది నిర్వహించిన సీఎం జగన్ బెస్ట్ సీఎంగా నిలవగా ఈ సారి మాత్రం గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.

జాతీయ స్థాయిలోనూ జగన్‌కు ఆదరణ తగ్గినట్టు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. గతేడాది ఇదే సర్వేలో జాతీయ స్థాయిలో జగన్ బెస్ట్ సీఎం అంటూ 11 శాతం మంది ఓట్లేయగా, ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఆరు శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు. ఇక, జాతీయ స్థాయిలో బెస్ట్ సీఎంగా 19 శాతం ఓట్లతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఆయన ఆదరణ 6 శాతం తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది. ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (38శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (35శాతం) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ టాప్-10 జాబితాలో ఏపీ సీఎం జగన్ పేరు కనిపించలేదు. ఏపీలో 19శాతం మంది కూడా జగన్‌ను ‘ఉత్తమ సీఎం’గా గుర్తించకపోవడం గమనార్హం. టాప్-10 జాబితాను మాత్రమే వెల్లడించడంతో జగన్ స్థానం ఎంతన్నది తెలియరాలేదు.

ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 11 శాతం ప్రజాదరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా 19 రాష్ట్రాల పరిధిలో 115 లోక్‌సభ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ స్థానాల్లో గత నెల 10-20 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంగా 14,599 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 71 శాతం మందిని గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 29 శాతం మందిని పట్టణ ప్రాంతాలకు చెందినవారు.

ఇది కూడా చదవండి: శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు 9 ఏళ్ల బాలికకు అనుమతి

Advertisement

తాజా వార్తలు

Advertisement