Monday, July 1, 2024

AP: హంద్రీనీవా అధికారులపై సీఎం ఆగ్రహం

ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి
కుప్పం బ్రాంచ్ కాలువ పూర్తి అయ్యినట్లు ఎలా చెప్పారు
కుప్పం, జూన్ 25(ప్రభ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేస్తున్న క్రమంలో మంగళవారం హంద్రీ నీవా కాలువల పరిశీలనకు చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్బంగా హెచ్ ఎన్ ఎస్ ఎస్ అధికారులు కుప్పం బ్రాంచ్ కాలువ పనుల పురోగతి గురించి వివరిస్తూ… ఇంకా చేయాల్సిన పనులను మ్యాప్ ద్వారా తెలిపారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదరు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనీ మొత్తం పనులు పూర్తి అయ్యిందని చెప్పి గత పాలకులు వేసిన డ్రామాలకు మీరు వంత పాడింది మంచి పద్దతి కాదన్నారు. త్వరలో పనులు వేగవంతంగా జరిగేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement