Tuesday, September 17, 2024

AP | గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు భేటీ !

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో… రాష్ట్రంలో వరదల పరిస్థితి, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎంతో కృషి చేసిందని, అహోరాత్రులు నిరంతరం శ్రమించి సహాయ, పునరావాస చర్యలను పెద్దఎత్తున చేపట్టిందని తెలిపారు.

దీనిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందిస్తూ.. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలను అబ్దుల్ నజీర్ అభినందించారు. అతి త్వరలో రాష్ట్రం, విజయవాడ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement