Thursday, July 4, 2024

AP – స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రాష్ట్రవ్యాప్తంగా జులై 1న జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం లో చంద్ర బాబు పాల్గొని స్వయం గా లబ్ధి దారులకు పెన్షన్ అంద చేయ నున్నారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు, ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు

చేబ్రోలు లో జన సేనాని. .

అలానే పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు మండలం, చేబ్రోలు గ్రామంలో పెన్షన్లు ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్ లబ్ధిదారుల ఇంటికి సీఎం , డిప్యూటీ సీఎం వెళ్లడం దేశచరిత్రలో తొలిసారి కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement