Friday, October 18, 2024

AP – వైభవంగా బ్రహ్మోత్సవాలు , శరన్నవరాత్రి వేడుకలు – చంద్రబాబు హర్షం

ఆమరావతి: తిరుమలలో బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల్లో పండగలు అంతర్భాగంగా ఉంటాయని.. వాటి పవిత్రత కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టి టి డి కి అభినందనలు తెలిపారు. ‘

- Advertisement -

‘తిరుమలలో ఏటా 450 ఉత్సవాలు జరుగుతాయి. అన్నింటికంటే బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. స్వామివారిని 6 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వాహన సేవలకు 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. గతంలో 16 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించారు. ఈ ఏడాది 26 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. పండగ విశిష్టత, వైభవం ఉట్టిపడేలా అద్భుత ఏర్పాట్లు చేశారు. లైట్లతో పాటు ప్రత్యేక డిజిటల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు” అని చంద్రబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement