Saturday, July 6, 2024

AP – సిఎం హోదాలో నేడు తొలిసారి ఢిల్లీ కి వెళ్లనున్న చంద్ర బాబు

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌ నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం ఉంది.

కాగా, ఈరోజు సాయంత్రం 5:10 గంటలకు విజయవాడ నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీతో సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిసే అవకాశం ఉంది.

- Advertisement -

.ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం.. పారిశ్రామిక రాయితీలు, మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్ట్ వంటి అంశాల అమలుపై సహాయం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రి నేటి షెడ్యూల్

ఉదయం 11.00 గంటలకు సచివాలయానికి వెళ్తారు

మధ్యాహ్నం 03.00 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు.

సాయంత్రం 05.00 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement