Wednesday, July 3, 2024

AP | ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్యతో పాటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శి అయిన పి.హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. కాగా, కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ లు మంగళవారం (జులై 2న) నామినేషన్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement