Thursday, October 10, 2024

AP: ప్రారంభమైన ఏపీ కేబినెట్ స‌మావేశం…

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం ప్రారంభ‌మైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమావేశం కొన‌సాగుతోంది. రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నివాళులర్పించారు.

అలాగే అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా ఈ సమావేశంలో చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement