Sunday, September 15, 2024

AP – మరి కొద్దిసేపట్లో రాష్ట్ర కేబినెట్‌ భేటి

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్తుండటం గమనార్హం. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది

ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం అవుతారు. రాత్రికి ఢిల్లీలో బస చేస్తారు. ఆ తర్వాత రోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. విభజన సమస్యలను పరిష్కరించాలని అమిత్‌షాను చంద్రబాబు కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతర రాజకీయ అంశాలపై కూడా అమిత్‌షాతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement