Wednesday, September 18, 2024

AP: కేబినెట్ భేటీ తేదీ మారింది…

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం తేదీ మారింది. ఈనెల 27న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆరోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపింది.

24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను సీఎస్ కార్యాలయం ఆదేశించింది. ఈ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై కేబినెట్ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement