Friday, September 20, 2024

AP Cabinet – స‌ర్వే రాళ్ల‌పై జ‌గ‌న్ బొమ్మ తొల‌గింపు … పాస్ పుస్త‌కాలు సైతం వెన‌క్కి

పెండింగ్ భూముల రీ స‌ర్వే
15న అన్న క్యాంటిన్ లు ప్రారంభం
పోర్టులు,ఎయిర్ పోర్టులు అభివృద్ధికి నిర్ణ‌యం
చంద్ర‌బాబు కేబినేట్ భేటీలో ఆమోద‌ముద్ర

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీకి అమోద ముద్ర వేసింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి మంత్రివర్గంలో చర్చించారు. కొత్త పాలసీ ప్రకటనక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ సీఎం భూమల సర్వే..రాళ్ల పై ఫొటోల అంశం పైన చర్చించారు. వాటి స్థానంలో ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మావోయిస్టుల పై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది.

ఆమోద ముద్ర
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. ఎన్నికల్లో హమీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేెశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై కెబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై మంత్రివర్గం చర్చించింది.

కొత్త పాలసీ
గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కెబినెట్ సూచన చేసింది. ఇక..మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కెబినెట్లో నిర్ణయం ప్రకటించింది. భూమల సర్వే పేరుతో రాళ్ల పైన జగన్ బొమ్మ అంశం పైన మంత్రివర్గంలో సుదీర్గంగా చర్చ జరిగింది.

- Advertisement -

కొత్తగా పాసు పుస్తకాలు
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయించింది. తొలుత మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చ సమయంలో పలువురు మంత్రులు జగన్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం రూ. 700 కోట్లు తగలేశారన్న మంత్రులు వ్యాఖ్యానించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరూ తొలగించడానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి కెబినెట్ నిర్ణయం. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు
పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన..
జీవో నెంబర్‌ 217, 144 జీవోలు రద్దు
రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి..
స్థానిక మత్స్యకారులకు అవకాశం
స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో..
ఇద్దరు పిల్లల నిబంధన మినహాయించుతూ తీర్మానం
కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం
పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర

Advertisement

తాజా వార్తలు

Advertisement